మన్యం మనుగడ వాజేడు:-
తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం మన ఊరు మన బడి, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చేయుట కొరకు తీసుకొచ్చిన పథకం మన ఊరు-మన బడి, రాష్ట్రంలోని 26,065 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలో చదువుతోన్న విద్యార్థులకు కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తయారు చేయాలనే ఉద్దేశంతో నాణ్యమైన విద్య, విలువలతో కూడిన విద్యను అందించాలని, పాఠశాలలకు విద్యార్థుల, హాజరుతో పాటు వారు తమ పాఠశాల విద్యను ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగించేందుకు వసతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ప్రభుత్వం చేపట్టిన మన ఊరు మన బడి ప్రారంభోత్సవ కార్యక్రమం లో చిన్నగొల్లగూడెం, గ్రామం ,మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం, స్వర్ణలత. మాట్లాడుతూ. మన ఊరు మన బడి. ప్రారంభోత్సవం వాజేడు మండలం, పేరూరు గ్రామ పంచాయతీలో రాంపురం, చిన్న గొల్లగూడెం, రెండు గ్రామాలలో స్కూల్స్ సెలక్ట్ అయినట్లు తెలిపారు. మౌలిక వసతులు భవన నిర్మాణ మరమ్మత్తులు, ఏ,ఈ అంచనా ప్రకారం రూ 4. లక్షలు మంజూరు అయినట్లు అలాగే ఇద్దరు గ్రామస్థుల నుండి జాయింట్, అకౌంట్ ఓపెన్ చేసినట్లు తెలిపారు.గ్రామస్తులు పాఠశాలను అందంగా తీర్చిదిద్దడం కోసం గ్రామ పెద్దలు, ఎన్నారైలను ఆర్థికగా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ నిరోషా, సర్పంచ్ యాలం సరస్వతి, ఎంపిటిసి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నరసింహులు, వార్డు నెంబర్ మల్లయ్య, గ్రామ పెద్ద తాడూరి వెంకట్రామయ్య, సంతోష్, పాపారావు, ఆదినారాయణ, సారయ్య, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: