మన్యం టీవీ దుమ్ముగూడెం ::
దుమ్ముగూడెం మండల స్థాయి యలమంచిలి సీతారామయ్య మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ కటాయిగూడెం గ్రామంలో నెల రోజుల పాటు నిర్వహించిన పోటీలో 20,000 మొదటి బహుమతి నడికుడి,15,000 రెండవ బహుమతి కటాయిగూడెం, 8,000 మూడో బహుమతి బైరాగులపాడు విజేతగా నిలిచారు... ముగింపు వేడుకల్లో పాల్గొన్న జిల్లా నాయకులు మండల కార్యదర్శి కారం పుల్లయ్య ఎంపీటీసీ సభ్యులు వంశీకృష్ణ శ్రీను బాబు వారు మాట్లాడుతూ భవిష్యత్తులో రాజకీయాలకు అతీతంగా ఫ్రెండ్లీగా సోదరభావంతో ముందు ముందు క్రీడలను ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కొనసాగించాలని వారు అన్నారు రానున్న రోజుల్లో యువతరం అందరూ ఈ టోర్నమెంట్ కు సహకరించిన ముందుకు నడిపించిన కటాయిగూడెం గ్రామ పెద్దలకు మరియు ముఖ్యంగా యూత్ కమిటీ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మర్మం చంద్రయ్య, యలమంచి శ్రీనుబాబు, సున్నం నరసింహాచారి, ఎలమంచి చిన్ను, తేల్లం ధర్మయ్య, గ్రామ పెద్ద కొరస ధర్మయ్య, మాజీ సర్పంచ్ మర్మం సమ్మక్క, కాకా రాంబాబు, మర్మం నాగరాజు, కొరస లింగరాజు, కల్లూరి వీరభద్రం, కోడి చంటి, కిరణ్, ముత్యాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: