మన్యం మనుగడ, అశ్వారావుపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలంలో పెద్ద ఎత్తున్న అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను సిఐ బంధం ఉపేందర్ రావు ఆధ్వర్యంలో ఎస్ఐ చల్లా అరుణ తన సిబ్బందితో మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్ గఢ్ నుంచి అశ్వారావుపేట మీదుగా ములకలపల్లి,
జగన్నాధపురం గుట్కాను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ అరుణ సిబ్బందితో కాపు కాసి నిందితులను పట్టుకున్నారు. వాహనంలో తరలిస్తున్న గుట్కా బ్యాగులను స్వాధీనం చేసుకొని ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన అంబుల్లా వీరాచారి 27, ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన గజ్జల అవినాష్ 32 ఇద్దరిని అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు స్థానిక ఎస్ఐ చల్ల అరుణ తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 4 లక్షల ఏభై వేలు వరకూ ఉంటుందని వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిషేధించిన గంజాయి గుట్కా, టొబాకో ముడి పదార్థాలు కలిగి ఉన్నా, అక్రమంగా రవాణా చేసినా, ఇతరులకు అమ్మినా వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Post A Comment: