మన్యం మనుగడ, అశ్వరావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గంలో పలు సమస్యలపై ఆదివాసీ నాయకులు గ్రీవిన్స్ లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ కి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అశ్వారావుపేట మండలం పరిధిలో అమ్మ సేవసదనం వృద్ధాశ్రమానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలని దరఖాస్తు ఇవ్వడం జరిగిందని ఆదివాసీ నాయుకులు తెలిపారు, దానికి కలెక్టర్ సానుకూల స్పందించి స్థలం కేటాయించి ప్రభుత్వం ద్వారా నిర్మాణం చేపడాతాము అన్నారని తెలిపారు. దమ్మపేట మండలం పార్కలగండి గ్రామపంచాయతీ పరిధిలో సితారాం ప్రాజెక్ట్ కాల్వ పనులు నిలుపుదల చేయాలని స్థానిక ఆదివాసీ గిరిజన రైతులు కోరుతూ కలెక్టర్ కి దరఖాస్తు ఇవ్వడం జరిగిందని తెలిపారు. సానుకూలంగా స్పందించి పూర్తి వివరాలు తెలుసుకొని రైతులకి తగు న్యాయం చేస్తానని అధికారులకు ఆదేశాలు జారీ చేశారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదివాసి యువ నాయకులు జిఎస్ఎస్ రాష్ట్ర కన్వీనర్ బాడిశ భిక్షం, జిఎస్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు అరేం ప్రశాంత్, నియోజక వర్గ ఆదివాసీ యువ నాయుకులు కాకా శివశంకర్, వాడే విరస్వామి, స్థానిక ఆదివాసీ గిరిజన రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Navigation
Post A Comment: