CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

సబ్సిడీపై ఎరువులు విత్తనాలు అందుబాటులో ఉన్నాయి రైతులు సద్వినియోగం చేసుకోవాలి :- పిఎసిఎస్ చైర్మన్ రామయ్య

Share it:

 


గుండాల మే 26(మన్యం మనుగడ) మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని గుండాల, ఆళ్ల పల్లి మండలాల రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పి ఏ సి ఎస్ చైర్మన్ రామయ్య రైతులకు సూచించారు. పచ్చిరొట్ట ఎరువులు, జీలుగ, విత్తనాలు పిల్లిపెసర, అందుబాటులో ఉన్నాయన్నారు. సబ్సిడీపై వీటిని సబ్సిడీపై అందించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. పచ్చిరొట్ట సాగుచేసి పూత దశలో ఉన్నప్పుడు కలిగయ ఉండడం వలన భూమికి భూసారం పెరుగుతుందని ఆయన అన్నారు. దానితోపాటు భూమి నీటిని విడుదల చేసే సామర్థ్యం పెరుగుతుందని ఆయన సూచించారు అందుచేత ప్రతి ఒక్క రైతు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముక్తి సత్యం, రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ బాలయ్య,వ్యవసాయఅధికారినీ దీపిక, గుండాల ఎంపీటీసీ సంధాని, వ్యవసాయ విస్తరణ అధికారి కుమార్, పి ఎస్ సి ఎస్ సి ఈ ఓ రాంబాబు, రైతులు ఎస్.కె అజ్గర్, గడ్డం సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

Share it:

TS

Post A Comment: