గుండాల మే 11(మన్యం మనుగడ) అభివృద్ధిలో దూసుకుపోతున్న గుండాల, ఆళ్లపల్లి ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు రెండు మండలాలకు భారీ ఎత్తున నిధులు మంజూరు చేయడంతో పనులు వేగంగా సాగుతున్నాయి. చెట్టుపల్లి, కొమరారం రహదారి కోసం ఆరున్నర కోట్లు, కిన్నెరసాని నదిపై బ్రిడ్జి నిర్మాణం కోసం తొమ్మిది కోట్లు, గుండాల నుండి వీరాపురం వరకు రహదారి కోసం 28 కోట్ల 50 లక్షలు కొడవటంచ నుండి నడిగూడెం వరకు 5 కోట్లు, మోదుగుల గూడెం నుండి సజ్జల బోడు వరకు రహదారి కోసం 3 కోట్ల రూపాయలు అంతర్గత రహదారుల కోసం మూడు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేయించారు. రహదారులు , బ్రిడ్జీలు, సిసి రోడ్లకు భారీగా నిధులు మంజూరు చేయడంతో పల్లెల్లో అభివృద్ధి పరుగులు పెడు తుందని ఉమ్మడి మండలా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
Navigation
Post A Comment: