CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఆదివాసి మహిళని అవమానపరిచిన తాసిల్దార్ పై చర్యలు తీసుకోవాలి..

Share it:

 


మన్యం టివి దుమ్ముగూడెం::

పెద్ద నల్లబెల్లి గ్రామానికి చెందిన ఆదివాసి మహిళ పాయం రాజమ్మ గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటుంది అందులో భాగంగా ఒక వ్యక్తి దగ్గర ఇంటి స్థలం కొని నివసిస్తుంది స్థలంపై కొందరు వ్యక్తులు స్థలం నాదంటూ దౌర్జన్యం చేస్తున్నారు అంటూ ఈ సమస్యపై స్థానిక ఎమ్మార్వో కి విన్న పించుకుందామని పెంచుకుందామని మండల ఆఫీస్ కు వస్తే మహిళా అని చూడకుండా ఒక అధికారి నోటికి వచ్చినట్లు తిట్టడం సరికాదని ఏఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేశ్వరావు, జిల్లా అధ్యక్షులు నర్సింగరావు డివిజన్ అధ్యక్షులు మల్లు దొర డిమాండ్ చేశారు ఆదివాసీల సమస్యలు అంటే ఎందుకు అంత చులకన అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆమె ఈ సమస్యపై భద్రాచలం మొబైల్ కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా తాసిల్దార్ హేళన చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆరోపించారు. ఆదివాసీ పై ఎంత చిన్నచూపు చూస్తున్న అధికారులు ఆదివాసీలపై అవగాహన లేక కించపరిచేలా మాట్లాడుతున్న అధికారులను బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కారం కావడం లేదని తోడుగా తీసుకెళ్లిన విలేకరులపై కూడా దుర్భాషలాడిన ఎమ్మార్వో పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకొని పోవాలని అన్నారు.

Share it:

TS

Post A Comment: