మన్యం మనుగడ, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం తిమ్మంపేట గ్రామంలో గురువారం ఎస్సీ కాలనీలో బిలుపాటి లక్ష్మీనారాయణ అనే రైతు గడ్డివాము ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని పూర్తిగా కాలిపోయింది. మంగపేట ఏరియాలో ఫైర్ ఇంజన్ లేకపోవడం వలన గ్రామస్తులు గ్రామ పంచాయతీ సిబ్బందికి ఫోన్ చేయగా,వెంటనే స్పందించి గ్రామపంచాయతీ వాటర్ ట్యాంక్ ని పట్టుకుని రాగా,గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామస్తులు కలిసి రెండు గంటలు దాకా కష్టపడి మంటలు చుట్టుప్రక్కల ఇళ్లకు ప్రాకకుండా ఆర్పేశారు.గడ్డివాము రైతు బిలుపాటి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మూడు ఎకరాల గడ్డివాము రూ,40 వేల దాకా నష్టం వాటిల్లిందని వాపోయారూ.ఏటూరునాగారం ఏరియాలో ఫైర్ ఇంజన్ స్టేషన్ లేకపోవడం దురదృష్టకరమన్నారు. గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు స్పందించి మంటలు ఆర్పక పోతే .. ఇక్కడ 30ఇండ్ల దాకా కాలిపోయేవని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామపంచాయతీ సిబ్బంది.. పూజారి గణేష్.. సుదర్శన్.. బోడ రామకృష్ణ వెంటనే స్పందించి వచ్చి మంటలను ఆర్పి నందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు.భాధితునికి తగిన నష్ట పరిహారం ఇవ్వాలని గ్రామస్తులు కోరారు.
Post A Comment: