మన్యం టివి దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం మండలంలో పర్ణశాల గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గోదావరి మంచి నీటిని శుద్ధి చేసే మిషన్ భగీరథ కార్మికులకు గత మూడు నెలల నుండి రావలసిన పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మిషన్ భగీరథ కంపెనీ యాజమాన్యానికి ప్రభుత్వ అధికారులను డిమాండ్ చేశారు రెండు రోజుల నుండి సిఐటియు ఆధ్వర్యంలో జరుగుతున్న మిషన్ భగీరథ కార్మికులను మద్దతుగా కార్మికులను ఉద్దేశించి కారం పుల్లయ్య మాట్లాడుతూ కార్మికులకు ప్రతినెల ఒకటో తేదీన వేతనాలు అందించే విధంగా కృషి చేయాలని అలాగే నెలకు మూడు వేల రూపాయలు పెట్రోల్ చార్జీలు ఇవ్వాలని అని కార్మికులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని ఎండనక వాననక రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి కార్మికులకు వేతనాలు చెల్లించకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని కంపెనీ యాజమాన్యం వర్గానికి హెచ్చరిక చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా ,స్థానిక ఉపసర్పంచ్ ఖాదర్ బాబు, మిషన్ భగీరథ కార్మికులు పవన్, పెనుబల్లి వెంకటేష్ , కళ్యాణ్ ,అపక సురేష్, శ్రీను, బాలకృష్ణ ,రాములమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు
Post A Comment: