CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మండలం లోని కళాశాలకు పోవటానికి బస్సు సౌకర్యం కల్పించాలి.పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట్ విడుదల చేయాలి-స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా

Share it:


మన్యం మనుగడ, మంగపేట.


 పెండింగ్లో ఉన్న అన్ని స్కాలర్షిప్ ఫీజు రియింబర్స్మెంట్ విడుదల చేయాలని, బస్సు సౌకర్యం కల్పించాలని, భారత విద్యార్థి సమాక్య ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగపేట తహసీల్దార్ కు వినతిపత్రం అందజేయడం జరిగింది. 

ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కన్వీనర్ తోకల రవి మాట్లాడుతూ కళాశాల కు వెళ్ళడానికి సమయానికి బస్సు సౌకర్యం లేక పేద,మధ్య తరగతి విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మంగపేట జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలకు బ్రాహ్మణపల్లి, కోమటిపల్లి ,బాలన్న గూడెం నరసింహసాగర్ ,నుండి రోజు దాదాపు 1000 మంది దాకా విద్యార్థులు కళాశాలకు వస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సౌకర్యం నిమిత్తం కళాశాలకు సరైన సమయంలో బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని ఈ సందర్బంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోరారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల నాయకులు వసంత్ ,షఫీ, సాగర్, సిద్దు, రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: