గుండాల మే 1(మన్యం మనుగడ) రోడ్డు ప్రమాదంలో ఇల్లందు డి.ఎస్.పి రవీందర్ రెడ్డి గన్ మెన్ కల్తీ భద్రం మృతి చెందారు. శనివారం రాత్రి విధులు ముగించుకుని తన స్వగ్రామమైన హనుమంతుల పాడు వెళ్తుండగా కరెంట్ ఆఫీస్ సమీపంలోని ఎల్లమ్మ గుడి వద్ద రాంగ్ రూట్ లో వచ్చిన టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో తీవ్ర గాయాలపాలైన భద్రము ఖమ్మం తరలించగా అప్పటికే మృతి చెందారు. టేకులపల్లి సంతలో నిత్యవసర వస్తువులు అమ్మి తిరిగి వస్తున్న టాటా ఏసీ వాహనం ఢీ కొనడంతో మృతి చెందాడు
Post A Comment: