CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

పినపాక కు నిధులు వరద: ఫలించిన విప్ రేగా కృషి రూ.73.27 కోట్ల రూపాయలు మంజూరు.అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన విప్ రేగా వెల్లడి

Share it:



  • టిఆర్ఎస్ ప్రభుత్వం తోనే అభివృద్ధి సాధ్యం


  • సీఎం కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన విప్,ఎమ్మెల్యే రేగా కాంతారావు


మన్యం టివి మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,గుట్ట మల్లారం గ్రామం,హనుమాన్ ఫంక్షన్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం నాడు ఇరిగేషన్,పంచాయతీ రాజ్, ఐటిడిఎ,ఆర్ అండ్ బి శాఖల అధికారులతో జరుగుతున్న అభివృద్ధి పనులు,పెండింగ్ పనులు,తదితర అంశాలపై, ప్రత్యేక రివ్యూ సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా విప్ రేగా కాంతారావు మాట్లాడుతూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని,త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం నియోజకవర్గం లోని రహాదారులు మరియు బ్రిడ్జిలు నిర్మాణం కొరకు రాష్ట ప్రభుత్వం మొత్తం *రూ.7327.38 లక్షలు *73.27 కోట్లు* పాలనాపరమైన అనుమతులు *అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్* మంజూరు చేసిందని తెలియజేశారు.ఈ పనులు త్వరలోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసుకొని,పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు.ఇంత పెద్ద మొత్తం లో రహాదారులకు నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు, ఆర్&బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి,స్థానిక మంత్రివర్యులు గౌరవనీయులు పువ్వాడ. అజయ్ కుమార్,స్థానిక ఎంపీ మాలోత్.కవిత మరియు సహాకరించిన జిల్లా కలెక్టర్ అనుదీప్,జిల్లా ఎస్పీ సునీల్ దత్ కు నియోజక వర్గ ప్రజల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.


పినపాక నియోజక వర్గంలో

ఎల్ డబ్ల్యు ఈ 3 వ విడతలో భాగంగా గ్రాంటు అయిన రూ. *73.27 కోట్లు* వివరాలు


1.ముత్తాపురం నుండి దొంగతోగు వరకు గుండాల మండలం రోడ్ కు రూ.1438.71 లక్షలు

2.దామరథోగు నుండి ఎస్సి కాలనీ వరకు గుండాల మండలం రోడ్ కు రూ.80.96 లక్షలు     

3.అడవిరామవరం నుండి దొంగతోగు వరకు గుండాల మండలం రోడ్ కు రూ.743.20 లక్షలు

 4.సాయనపల్లి నుండి అడవిరామవరం గుండాల మండలం వరకు రోడ్ కు రూ.723.50 లక్షలు      

5.ఆళ్లపల్లి మెయిన్ రోడ్ రాఘవపురం వద్ద పనులకు ఆళ్లపల్లి మండలం రూ.632.42 లక్షలు

6.ఆళ్లపల్లి నుండి వెంకటాపురం వరకు ఆళ్లపల్లి మండలం రోడ్ రూ.1131.84 లక్షలు

7.మార్కోడు నుండి అడవిరామవరం వరకు ఆళ్లపల్లి మండలం రోడ్ కు రూ.2024.75 లక్షలు

8.కిస్టాపురం నుండి పిట్టతోగూ వరకు పినపాక మండలం రోడ్ కు రూ.296.00 లక్షలు

9.భూపతిరావుపేట నుండి సుందరయ్య నగర్ వరకు పినపాక మండలం రోడ్ కు రూ.156.00 లక్షలు 

10.గ్రంధాలయం నిర్మాణం కొరకు రూ 100.00 లక్షలు

Share it:

TS

Post A Comment: