- అభివృద్ధి ప్రదాతకు ధన్యవాదాలు అంటున్న ప్రజలు
గుండాల మే 7(మన్యం మనుగడ) ఉమ్మడి గుండాల మండలానికి నిధుల ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు భారీగా నిధులను కేటాయించారు మొత్తం 68 కోట్ల పైచిలుకు నిధులను ఉమ్మడి గుండాల మండలానికి కేటాయింపు చేశారు. ముత్త పురం నుండి ఇ దొంగతో గు వరకు ఈ రహదారి నిర్మాణం కోసం 14 కోట్ల 38 లక్షలు, దామోదర్ తోక ఎస్సీ కాలనీ నుండి గుండాల రోడ్డు వరకు 80లక్షల 96 వేలు, అడవి రామారం నుండి దొంగ వరకు 7 కోట్ల 43 లక్షలు, సాయన్న పల్లి నుండి అడవి రామారం వరకు 7 కోట్ల 23 లక్షలు, ఆళ్లపల్లి మెయిన్ రోడ్ నుండి రాఘవాపురం వరకు6 కోట్ల 32 లక్షలు, ఆళ్ల పల్లి నుండి పెద్ద వెంకటాపురం వరకు 11 కోట్ల 31 లక్షలు మర్కోడు నుండి అడవి రామారం వరకు 20 కోట్ల 24 లక్షలు, రహదారుల నిర్మాణం కోసం ఎల్ డబ్ల్యూ ఈ నుండి మూడో విడతగా నిధులను మంజూరు చేయించారు. ఉమ్మడి గుండాల మండలం లో ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని రహదారులకు సైతం నిధులు మంజూరు చేయించిన ఘనత రేగా కు దక్కుతుంది. గుండాల, ఆళ్ల పల్లి మారుమూల ప్రాంతాల్లోని గ్రామాలకు భారీగా నిధులు మంజూరు చేయించి నందుకు కృతజ్ఞతలు అని ఉమ్మడి మండల ప్రజలు పేర్కొంటున్నారు.
Post A Comment: