CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఏజన్సీ గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం.గ్రామాల అభివృద్ధికి రూ.5.62 కోట్ల రూపాయల నిధులు మంజూరు:ప్రభుత్వ విప్ రేగా కాంతారావు

Share it:



మన్యం టీవీ మణుగూరు:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

ఏజెన్సీ మారుమూల గ్రామాల అభివృద్దే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ,తెలంగాణ రాష్ట్రప్రభుత్వం రహదారుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చేందుక తెలంగాణ సీఎం కేసీఆర్ కోట్లాది నిధులను కేటాయిస్తున్నారన్నారు అని, పల్లెల్లో మౌళిక సదుపాయాల కల్పనకు,గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం పాటుపడుతోందన్నారు.ఇందులో భాగంగానే పినపాక నియోజకవర్గంలోని ఏజెన్సీ గ్రామాల అభివృద్ధికి రూ.5.62కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు.


1.మణుగూరు మండలం పిడబ్ల్యూడి రోడ్డు నుండి సమితిసింగారం వయా మద్దులగూడెం వరకు రూ.82లక్షలు.

2.బూర్గంపాడు మండలం సోంపల్లి నుండి బూర్గంపాడు వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర రూ.2.20 కోట్లు.

3.సంజీవరెడ్డిపాలెం నుండి లక్ష్మీపురం వరకు రూ.10లక్షలు.

4.కరకగూడెం మండలం కొత్తగూడెం నుంచి కొమరం వారి గుంపు వరకు రూ.25.29 లక్షలు.

5.పినపాక మండలం ఆర్ఎండ్ బి రోడ్డు నుండి అమరారం వరకు రూ.1.58కోట్లు.

6.ఆర్ఎండ్ బి రోడ్డు నుండి మారేడుగూడెం వరకు రూ.35 లక్షలు.

7.ఆర్ఎండ బి రోడ్డు నుంచి కొత్త మల్లారం వరకు రూ.15 లక్షలు.

8.ఆళ్లపల్లి మండలం మర్కోడు నుండి కాంచనపల్లి వరకు రూ.4 లక్షలు.

9.గుండాల మండలం గుండాల నుంచి శెట్టిపల్లి వరకు రూ.3 లక్షలు.

10.అమ్మగారిపల్లి నుంచి వయా అమెర్ద మీదుగా అశ్వాపురం రోడ్డు వరకు రూ.10.10లక్షల రూపాయల నిధుల మంజూరయ్యాయని తెలిపారు.రోడ్ల నిర్మాణానికి సంబంధించిన టెండర్లను పూర్తిచేసుకొని త్వరలోనే పనులను ప్రారంభిస్తామన్నారు. ప్రజల అభివృద్ధి కోసమే పని చేస్తున్న టిఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రతీ ఒక్కరు అండగా నిలవాలని కోరారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు మంజూరుచేస్తున్నందున అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేస్తూ, అభివృద్ధి చేసకోవాలన్నారు. ప్రభుత్వం ప్రవేశ ట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.


Share it:

TS

Post A Comment: