మన్యం మనుగడ, అశ్వారావుపేట:మండల పరిధిలోని గాండ్ల గూడెం పంచాయతీలో 40 కుటుంబాలు కాంగ్రెస్ గూటికి చేరాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జేష్ఠ సత్యనారాయణ చౌదరి కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రచ్చబండ కార్యక్రమంలో బాగంగా ఈరోజు గాండ్లగూడెం పంచాయతీలోని 40 కుటుంబాలు జిల్లా కాంగ్రెస్ నాయకులు జె సత్యనారాయణ చౌదరి దాసరి నాగేంద్ర ఆద్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే నని కాంగ్రెస్ పార్టీ వల్లే బడుగు బలహీన వర్గాల బతుకులు బాగుంటాయని, వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆగిరిపల్లి రాంబాబు, దాసరి రవి, కుంజా వెంకటేషు, మిండా నాగు, తమ్మిశెట్టి పోషయ్య, షేక్ బషీర్, బుక్యా సురేష్, ఆకిరేపల్లి సతీష్, గుజ్జా ఊషయ్య, మాలోతు రాము, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: