ములకలపల్లి:మే20:మన్యం మనుగడ ప్రతినిధి :
మండలం లో వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల నాయకులు కందుకూరి రాంబాబు ఆధ్వర్యంలో ములకలపల్లి సెంటర్ లో బీజేపీ దిష్టి బొమ్మను తగుల పెట్టడం జరిగింది.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధికార ప్రతినిధి పెనుబల్లి రమేష్ బాబు హాజరై మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ముస్లిం లకు 4% రిజర్వేషన్లను ఆనాడు కేటాయించగా, ఇప్పుడు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోవాలని,మొన్న తుక్కుగూడ లో జరిగిన సభలో అమిత్ షా వ్యాఖ్యానించడం సరికాదని హెచ్చరించారు.భారత రాజ్యంగం ప్రసాదించిన రిజర్వేషన్ ను రద్దు చేస్తా అనడం హాస్యాస్పదంగా ఉందని,
భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అంటాము.భిన్నత్వంలో ఏకత్వం ఉన్న మన దేశాన్ని కులం పిచ్చి తో, మతం పిచ్చితో వేరు చేయడాన్ని చూస్తుంటే, అమిత్ షా మతకల్లోలాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించండం జరిగిందని పేర్కొన్నారు.అమిత్ షా వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలోభద్రాద్రి కొత్తగూడెం జిల్లా తోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పువ్వాలా కొండల్ రావు, పెనుబల్లి సూర్యనారాయణ,బండి సుజాత,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: