CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ఈనెల 27న జరిగే నిరసన ధర్నా కార్యక్రమని విజయ వంతం చెయ్యండి.--సిపిఎం,సిపిఐ, ఎంఎల్ ప్రజాప్రంధ పార్టీ లు

Share it:

 


మన్యం మనుగడ కరకగూడెం: అధిక ధరలు పన్నుల భారాలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జరిగే నిరసన ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఎం సిపిఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు గద్దల శ్రీనివాసరావు,మధుసూదన్ రెడ్డిలు పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సన్నాహక సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ నాయకత్వంలో నడుస్తున్న బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి ధరలను విపరీతంగా పెంచి పేద మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతు ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారని రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో పేద ప్రజలు విలవిల్లాడుతున్నారని ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు తల్లడిల్లుతున్నారని ఈ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 27న ధర్నా నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. పెట్రోల్ డీజిల్ ధరలను సామాన్యుడు భరించలేనంతగా కేంద్ర బిజెపి ప్రభుత్వం పెంచుతూపోతున్నదని 2014లో 60-70 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటింది దాదాపు ఇదే స్థాయిలో డీజిల్ ధరలను కూడా పెంచిందని రూ450 లుగా ఉన్న వంటగ్యాస్ సిలిండర్ ధర 1055 కి పెరిగింది గ్యాస్ సబ్సిడీ సిలిండర్ ధరలను భారీగా పెంచిందని ఈ పెరుగుదల వల్ల అన్ని రకాల వస్తువుల ధరలు పెరిగాయి సామాన్య ప్రజల జీవన ప్రమాణాల తో సంబంధం లేకుండా సుంఖాలు పన్నులు ప్రజలపై నిత్యం వేస్తున్నదని మరోవైపు లక్షల కోట్ల రూపాయలు రాయితీలను పెట్టుబడి దారులకు కట్టపెడుతూ కేంద్రం ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఖాళీగా ఉన్న లక్షలాది పోస్టుల భర్తీ మాట ఎత్తడం లేదని పేద ప్రజల ద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంటే అంతకంటే ఎక్కువ భారాన్ని ప్రజలపై వేస్తున్నారని వారు దుయ్యబట్టారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధ్వంసకర విధానాల వల్ల సామాన్య ప్రజలు మరింత కునారిల్లే పరిస్థితి ఏర్పడతాయని వామపక్ష పార్టీలు తలపెట్టిన ఈ నిరసన కార్యక్రమాలు జయప్రదం చేయాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో లో సిపిఎం సిపిఐ సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మండల కార్యదర్శులు కొమరం కాంతారావు, వంగరి సతీష్, తోలెం లక్ష్మయ్య, నాయకులు ఊకే నరసింహారావు బుడుగం సతీష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: