CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అధిక ధరలు, నిరుద్యోగం పై మే 27న మండల కేంద్రంలో ధర్నా..

Share it:

 


మన్యం టీవీ దుమ్ముగూడెం :: 

దుమ్ముగూడెం మండలంలో ములకపాడు సెంటర్లో ఉన్న కామ్రేడ్ యలమంచి సీతారామయ్య భవనంలో జరిగిన వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దుమ్ముగూడెం మండల కార్యదర్శి కారం పుల్లయ్య, సిపిఐ పార్టీ మండల నాయకులు తాటిపూడి రమేష్, సిపిఐ ఎమ్మెల్ ప్రజాపందా నాయకులు సున్నం వీరభద్రం లు మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ గ్యాస్ అధిక ధరలు నిరుద్యోగం పై ఈ నెల 27న మండల కేంద్రంలో 30వ తేదీన జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాలో జయప్రదం చేయాలని ప్రజలకు వామపక్షాలు నాయకులు పిలుపునిచ్చారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని మరోవైపు నిరుద్యోగం గతంలో ఎన్నడు లేని అంతగా పెరిగిందని ఉపాధి అవకాశాలు లేక ఉన్నత చదువులు చదివి యువత నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ సహాయం కోసం ఎదురు చూస్తున్నారని అధిక ధరలు నిరుద్యోగం వంటి సమస్యలను కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులు అమ్మకాలు వ్యాపారాలు తలమునకలు అయిపోయి ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసింది అని కార్పొరేట్ పెట్టుబడిదారుల సేవలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బిజీగా ఉందని మీ చెల్లి వెంటనే తక్షణమే నిలుపుదల చేయాలని లేదంటే రానున్న కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు ఈనెల 27వ తేదీన మండల కేంద్రంలో జరిగే నిరసన ధర్నా ఈ నెల 30న జిల్లా కేంద్రంలో జరిగే నిరసన ధర్నా కార్యక్రమంలో వందలాది మంది పాల్గొని జయప్రదం చేయాలని వామపక్ష పార్టీల నాయకులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ, మర్మం చంద్రయ్య వై శ్రీను బాబు, సున్నం నరసింహాచారి, కొరస సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు..

Share it:

TS

Post A Comment: