మన్యం మనుగడ ఏటూరు నాగారం
తాడ్వాయి మండల కేంద్రంలో తుడుం దెబ్బ ముఖ్య నాయకుల అత్యవసర సమావేశం ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్యఅతిథిగా తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మైపతి అరుణ్ కుమార్ హాజరై మాట్లాడుతూ.ఈనెల13,14, 15 తేదీలలో మణుగూరు లో జరిగిన రాష్ట్ర స్థాయి ప్లీనరీలో తీర్మానం చేసిన విధంగా ఈనెల 27న శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారంలో ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ రాష్ట్ర కమిటీ ఎన్నికను అన్ని జిల్లాల మహిళా జిల్లా కమిటీలు హాజరై విజయవంతం చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోర్ని బెల్లి గణేష్, రేగా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: