మన్యం టీవీ ::
ఏజెన్సీ 5వ షెడ్యూల్ భూభాగంలో ఉన్న చట్టాన్ని అమలు చేయడంలో ఐఏఎస్ అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు పూర్తిగా విఫలమయ్యారని,1/70 చట్టాన్ని చూసినట్టుగా వ్యవహార ఇస్తున్నారని తెలిపారు ఆదివాసీ సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షుడు నర్సింగరావు అధ్యక్షతన చర్ల లో జరిగిన సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి పాండు హేమ సుందర్ మాట్లాడుతూ ఇటువంటి అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు ఏజెన్సీ చట్టాన్ని నిర్వీర్యం చేసే అధికారులు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదని ఇకనైనా ప్రభుత్వం కళ్లు తెరిచి 5వ షెడ్యూల్ భూభాగాన్ని కాపాడాలని లేనియెడల ఆదివాసి మనుగడ కనుమరుగవుతుందని వచ్చే జూన్ నుంచి తమదైన శైలిలో ఉద్యమ రూపంలో 1/70 చట్టంలో ఏ విధంగా భూ అక్రమాలు, బహుళ అంతస్తుల నిర్మాణం చేపడుతున్న వారిపై ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో చట్టాన్ని చేతిలోకి తీసుకుని కూల్చివేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోందె మల్లు దొర జిల్లా ప్రధాన కార్యదర్శి సీతయ్య, భద్రయ్య,విష్ణు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: