మన్యం మనుగడ,మంగపేట.
మంగపేట మండలంలోని తిమ్మంపేట గ్రామంలో సోమవారం మంగపేట పశువైద్యాధికారి ఆధ్వర్యంలో పశువైద్య శిబిరం నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఒక గేదె కి గొంతు వాపు లక్షణాలు కనిపించగా, దానికి వైద్య చికిత్స చేయడం జరిగిందని,ఈ వ్యాధి మిగిలిన పశువులకు కూడా సోకకుండా ముందస్తు జాగ్రత్తగా గ్రామంలోని అన్ని పశువులకు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయటానికి గొంతువాపు వ్యాధి నివారణ కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ శిబిరాన్ని రెండు రోజుల పాటు నిర్వహించతలపెట్టినట్లు స్థానిక పశువైద్యాధికారిని తెలిపారు.సోమవారం మొదటిరోజు 200 పశువులకు గొంతువాపు వ్యాధి నిరోధక టీకాలు వేయించగా, మంగళవారం మరో రెండు వందల పశువులకు వ్యాక్సిన్ వేయనున్నామని,ఈ అవకాశాన్ని పశుపోషణ యజమానులు విధిగా వినియోగించుకుని,తమకు సహకరించాలని దీనికోసం మంగళవారం గ్రామంలో ని మిగిలిన అన్ని పశువులకు టీకాలు వేయడం జరుగుతుంది కావున రైతులందరూ తమ పశువులకు గొంతువాపు టీకాలు వేసుకోవాల్సిన దిగా కోరుతున్నట్లు తిమ్మంపేట గ్రామీణ పశువైద్యశాల
జూనియర్ పశు వైద్య అధికారిని సోమవారం వైద్యశిబిరంలో కోరారు.
Post A Comment: