మన్యం మనుగడ ప్రతినిధి, అశ్వాపురం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు అశ్వాపురం మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ గారి అధ్వర్యంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురం పంచాయతీలో తెలంగాణ గిరిజన సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ ప్రవేశ పరీక్ష టి.జి యు జి సి ఈ టీ లో రాష్ట్ర స్థాయి లో మొదటి ర్యాంక్ సందించినా ఆదివాసీ విద్య కుసుమం సోయం హరిణీగాకి అశ్వాపురం మండల టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జాలే రామకృషారెడ్డి 5000వేలు మరియు తెరాస మండల ప్రధాన కార్యదర్శి,మొండికుంట సర్పంచ్ మర్రి మల్లారెడ్డిగారు2000 వేలు పై తరగతులకు వెళ్ళుటకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోడి అమరేందర్ ,మాజీ ఎంపీపీ కొల్లు మల్ల రెడ్డి, నియోజకవర్గ ఎస్సీసెల్ అధ్యక్షులు వెన్నె అశోక్ కుమార్, చిలక వెంకటరమయ్య,తుమ్మలచెరువు సర్పంచ్ బండ్ల సంధ్య రాణి, తుమ్మల చెరువు ఎంపీటీసి తాటి పూజిత, మండల యువజన ప్రధాన కార్యదర్శి కోరేం రామారావు, మండల నాయకులు సోయం శ్రీనివాస్,దాసరి దాసు, గడకారి రామకృష్ణ,బండ్ల కాంతారావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: