మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు సందర్శించారు.ఈ సందర్భంగా వైద్యం కోసం వచ్చిన గర్భిణీ స్త్రీలను పలకరించి,పౌష్టిక ఆహారం సరైన సమయంలో తీసుకోవాలని,తగు సూచనలు సలహాలు ఇచ్చారు. అదేవిధంగా ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలు గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ గిరి ప్రసాద్,డాక్టర్లు,మండల ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, యువజన నాయకులు,స్థానిక నాయకులు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: