మన్యం మనుగడ దుమ్ముగూడెం::
మానవత్వం మరిచిన వ్యక్తి మూగజీవాల పై ప్రతీకారం తీర్చుకున్నాడు. తన వరి పొలంలో కి వచ్చాయనే కోపంతో ఆవుల తోక నడుము పై కత్తితో దాడి చేశాడు. దుమ్ముగూడెం మండలం శ్రీనగర్ కాలనీ చెందిన కంచర్ల వెంకట్రాజు, నరసింహారావు చెందిన రెండు ఆవులు, రెండు గిత్తలు బైరగులపాడు గ్రామ శివారులో మేతకు వెళ్లాయి. ఈ క్రమంలో ఆవులు, గిత్తలు పరుగులు తీస్తూ పక్కనే ఉన్న వరి పొలంలోకి వెళ్లాయి కాసేపయ్యాక మూగజీవాలు గట్టిగా అరుస్తూ రావడంతో రైతులు ఏమైంది అని ఆందోళన చెందారు వెనుక భాగం నుండి రక్తం కారుతున్నఆవులను చూసి ఏముంది అని పరిశీలిస్తుండగా, తుర్రం నవీన్ అనే యువకుడు కత్తి పట్టుకుని పరిగెత్తుకుంటూ కనిపించాడు ప్రశ్నించగా తన పొలంలోకి వచ్చిన అందుకే ఆవును గాయపరచని చెబుతూ మరో రెండు గీతల నడుం పైకెత్తి దాడి చేశాడు ఈ విషయంపై వాదించగా నవీన్ అనే వ్యక్తి వారి మీద ఎదురుతిరిగాడు .ఈ విషయంపై ఆవుల యజమానులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Post A Comment: