మన్యం మనుగడ, మంగపేట.
మంగపేట మండలం మన్యం లోని ఒక ఆదివాసీ గూడెం శనగకుంట గ్రామం,ఈ గ్రామ ప్రజలు పూర్తిగా వ్యవసాయం మీద, పశుపోషణ ఆధారపడి జీవిస్తున్నారు. గురువారం వచ్చిన గాలి దుమారానికి కూతవేటు దూరంలో ప్రమాదవశాత్తు అంటుకున్న కార్చిచ్చు గాలి వాటంలో ఉన్న ఇండ్లకు అంటుకొని చాలా పెద్ద మొత్తంలో ఆస్తి నష్టం వాటిల్లింది, అదృష్ట వశాత్తు ప్రాణ నష్టం సంభవించలేదు. 24 ఇండ్లు అగ్నికి ఆహతి అయి సుమారుగా 40 కుటుంబాలు రోడ్డున పడ్డాయి, సుమారుగా ఒక కోటి రూపాయలు ఆస్తి నష్టం సంబవించి ఉండవచ్చు అని గ్రామస్తులు అంటున్నారు.శనగకుంట అంటే తెల్వని అధికారులు కూడా శనగకుంట రావడం జరిగింది. అభివృద్ధికి నోచుకోని శనగకుంట స్మశానాన్ని తలపించేలా ఏడుపులు, ఆర్తనాదాలతో హోరేత్తి పోతుంది. ,/అన్ని వాహనాలు శుక్రవారం నాడు శనగకుంట వైపు తరలినవి.భాధితులను పరామర్శించటానికి ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ములుగు ఎమ్మెల్యే సీతక్క, జిల్లా మండల అధికార యంత్రాంగం యావత్తు శనగకుంట లో తిష్ట వేసినవి.ములుగు ఎమ్మెల్యే సీతక్క,ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలకు మేరకు అధికారులు భాధితులకు పునరావాసం కల్పించి వారికి కావాల్సిన అవసరాలను సమాకుర్చడం లో నిమగ్నం అయినారు.
Post A Comment: