CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు లో అభివృద్ధి పనులను పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని అంబేద్కర్ సెంటర్ నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో జరుగుతున్న రోడ్డు విస్తరణ, డివైడర్స్,నిర్మాణ అభివృద్ధి పనులను సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు అధికారుల తో పాటు కలిసి పరిశీలించారు. పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.అనంతరం అభివృద్ధి పనుల త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.అనంతరం అంబేద్కర్ సర్కిల్ లో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించారు.త్వరలోనే అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరిస్తాము అని,అందుకు కావలసిన ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.అంబేద్కర్ సర్కిల్ లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తీసుకోవసిన చర్యలపై అధికారులు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయితీ రాజ్ శాఖ డి ఈ,మున్సిపల్ శాఖ,వివిధ శాఖల అధికారులు,సిఐ ముత్యం రమేష్,మండల ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,కార్యదర్శులు, నాయకులు,కార్యకర్తలు, యువజన నాయకులు, టిఆరేస్వి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: