మన్యం మనుగడ , పినపాక:
వికలాంగుల జీవితాలకు తాను ఒక భరోసా. వివిధ ప్రమాదాల్లో అవయవాలను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన జీవితాలకు నేనున్నానంటూ సాయం అందిస్తున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం సింగిరెడ్డి పల్లి పంచాయతీ బీసువారిగూడెం గ్రామానికి చెందిన పున్నం శ్రీను అనే వ్యక్తి గత కొంతకాలం క్రితం రోజువారీ పనికి వెళ్లగా గడ్డపార మోకాలుకు తగిలి చిన్న గాయం అయింది. కొన్ని రోజుల తర్వాత పెద్ద పుండుగా మారింది. యువకుడైన పున్నం శ్రీను వికలాంగుడిగా మారాడు. పున్నం శ్రీను విషయం తెలుసుకున్న సామాజిక కార్యకర్త తోలెం శ్రీనివాస్ ఆయన ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకొని హైదరాబాదులోని ఆకార్ఆశ స్వచ్ఛంద సేవ ఆసుపత్రిని సంప్రదించి పున్నం శ్రీను కాలుకు తగిలిన గాయానికి శస్త్రచికిత్స చేయించేందుకు ఒప్పించాడు. రెండు లక్షల ఇరవై వేల రూపాయలు విలువచేసే శస్త్ర చికిత్సను ఆసుపత్రి యాజమాన్యానికి తెలియజేసి ఉచితంగా చేయించడం జరిగింది. ఎన్ని రోజుల్లో వికలాంగులుగా ఉన్న శ్రీను శస్త్ర చికిత్స అనంతరం నడుస్తూ ఉండడంతో అతని ఆనందానికి అవధులు లేవు. మరువలేని సాయం చేసిన శ్రీనివాస్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇంతకు పూర్వము వికలాంగత్వం బాధపడుతున్న పినపాక మంగపేట మండలాలకు చెందిన పలువురు స్వచ్ఛంద సంస్థలను ఆశ్రయించి అవయవాలు పెట్టించడం జరిగింది.
Post A Comment: