CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

మణుగూరు మహాలక్ష్మి ఓ బి కంపెనీ లో చనిపోయిన కాంట్రాక్టు కార్మికుడు కుటుంబానికి న్యాయం చేయాలి.--:ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి డిమాండ్.

Share it:


 మణుగూరు మల్లేపల్లి మహాలక్ష్మి ఓబీ కంపెనీలో పనిచేస్తున్న చత్తీస్గఢ్ కు చెందిన ఓబి కాంట్రాక్టు కార్మికుడు మృతిచెందాడని, మృతుని కుటుంబానికి ఓబి యాజమాన్యం తగిన న్యాయం చేయాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ఉపాధ్యక్షులు మధుసూదన్ రెడ్డి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. స్థానిక వంద పడకల ఆసుపత్రిలో మృతుని భౌతికకాయాన్ని సందర్శించారు.

             ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాల నుంచి భార్య పిల్లలను వదిలి స్థానిక ఓ బి కంపెనీలలో పని చేయడానికి వస్తున్నారని, దీనిని అవకాశంగా తీసుకుంటున్న స్థానిక ఓబి యాజమాన్యాలు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఇతర రాష్ట్రాల కార్మికులను నియమించుకుని వారికి సరైన వసతి సౌకర్యాలు, వైద్య సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుడి మరణవార్త తెలుసుకుని ఎలా చనిపోయాడు అని యాజమాన్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసినా వారు స్పందించలేదన్నారు. కార్మికుల ప్రాణాల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి వారి కుటుంబ సభ్యులను పిలిపించి వారి కుటుంబానికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Share it:

TS

Post A Comment: