గుండాల/ ఆళ్లపల్లి ఏప్రిల్ 2(మన్యం మనుగడ) జార్జిరెడ్డి స్ఫూర్తితో విద్యార్థులు ఉద్యమించాలని పి.డి.ఎస్.యు రాష్ట్ర నాయకులు ఇర్ప రాజేష్ అన్నారు. శనివారం ఆ ళ్లపల్లి, మర్కోడు గ్రామాల్లో పి డి ఎస్ యు ఆధ్వర్యంలో జార్జి రెడ్డి 50 వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ప్రతి ఏటా ఏప్రిల్ ఒకటో తారీకు నుండి 14 వ తారీకు వరకు దేశవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. నాడు జార్జి రెడ్డి ని అంతమొందించిన మతోన్మాదం నేడు రాజ్యమేలుతోందని ఆయన అన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి జార్జిరెడ్డి ఆశయాలకు అనుగుణంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు శోభన్, సురేష్ , వెంకటేష్ , రంజిత్, నరేష్ , సాయి కుమార్ తరులు పాల్గొన్నారు
Post A Comment: