మన్యం మనుగడ దుమ్ముగూడెం::
స్వర్గీయ నందమూరి తారక రామారావు భారత రత్న బిరుదు ప్రదానం చేయాలనే డిమాండ్ పై దుమ్ముగూడెం మండల అఖిల పక్ష సమావేశం తెలుగు దేశం పార్టీ మండల అధ్యక్షులకొమరం దామోదర రావు అధ్యక్షతన జరిగిన సభలో ఏకగ్రీవంగా డిమాండ్ చేశారు.భద్రాచలం శాసన సభ్యులు పొందెం వీరయ్య మాట్లాడుతూప్రపంచ చలన చిత్ర రంగంలో తిరుగులేని కథానాయకుడిగా,రాజకీయరంగంలో సంక్షేమ పథకాలు అమలు పరచిన నాయకుడిగా ,ప్రజలకు ఎనలేని సేవలు అందించిన ఎన్.టి.ఆర్ కు భారత రత్న ఇచ్చితీరాలని ఇప్పటికే చాలా ఆలస్యం జరిగిందని, కేంద్ర ప్రభుత్వం వేరే ఆలోచనలు లేకుండా ,వారి కుటుంబ సభ్యుల ను ఆహ్వానించి,బిరుదు ప్రదానం చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మహబూబ్ బాద్ పార్లమెంటు నియోజకవర్గ టిడిపి ఉపాధ్యక్ష లు,కొడాలి శ్రీ నివాస్, వెంకటరెడ్డి పేట సర్పంచ్,టి.డి.పి.మాజీ నియోజకవర్గ ఇన్ చార్జీ కొమరం ఫణీశ్వరి,దుమ్ముగూడెం జడ్పిటిసి తెల్లం సీతమ్మ, ఎన్.టి.ఆర్ అభిమాసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.కె.అజీమ్,సి.పి.ఐసభ్యులు రామిరెడ్డి, కాంగ్రేసు పార్టీ మండల అధ్యక్షులు లంకా శ్రీనివాస్,టి.ఆర్.ఎస్ నాయకులు కొత్తూరి సీతారామారావు, జి.ఎస్.పి రాష్ట్ర ఉపాధ్యక్షులు ముర్రేం వీరభద్రం, పర్ణశాల సర్పంచ్ వరలక్ష్మి, చర్ల టి.డి.పి. నాయకులు రామాంజినేయులు, యడారి సత్యనారాయణ,ఎటాపాక్ మండల టి.డి.పి అధ్యక్షులు పుట్టి రమేష్, దుమ్ముగూడెం మండల టీ.డీ.పీ కార్యదర్శి కెల్లా వేణుగోపాల్, తెల్లం హరికృష్ణ,కనుబుద్ధి దేవా పూనెంప్రసాద్,సోడియం కళావతి,పొడియం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: