మన్యం మనుగడ, మంగపేట.
శనగకుంటలో గురువారం ప్రమాద వశాత్తు సంబవించిన అగ్ని ప్రమాదంలో సుమారుగా నలభై కుటుంబాలు సర్వస్వం కోల్పోయిన బాధితులను పరామర్శించిన ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య. బాధితులకు ప్రభుత్వం తరపున అన్నివిధాలుగా అండగా ఉంటామని, తక్షణమే పునరావాసం కల్పించి వారిని ధైర్యంగా ఉండాలని సూచనలు చేశారు. కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఏటూరునాగారం ఏ ఎస్పీ అశోక్ కుమార్, మంగపేట పోలీస్ స్టేషన్ ఎస్ ఐ తాహెర్ బాబా,గ్రామస్తులతో మాట్లాడి సంఘటనకు గల కారణాలు తెలుసుకున్నారు. ఐటీడీఏ అధికారులు, రెవిన్యూ అధికారులు స్థానిక అధికారులు, స్వచ్చంద సంఘాలు గ్రామ యువత మనం అందరం కలసి బాధితులకు ఈ సందర్బంగా అండగా నిలవాల్సిన సందర్బం అని తెలియజేశారు.
Post A Comment: