గుండాల ఏప్రిల్ 6(మన్యం మనుగడ) విద్యుత్ చార్జీలు పెంపుతో సామాన్యులపై భారం రాష్ట్ర ప్రభుత్వం వేసిందని టిడిపి మండల అధ్యక్షులు తోలేం సాంబయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో విద్యుత్ చార్జీలు తగ్గించాలని వినతి పత్రాన్ని ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ చార్జీలు పెంచడం వలన సామాన్యులకు భారంగా మారుతుందని అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంధాని, ఇల్లందుల నరసింహులు, ఇల్లందుల అప్పారావు, కె బుచ్చయ్య, తొలెం బుచ్చయ్య, గుర్రం రాములు, కే పాపయ్య తదితరులు పాల్గొన్నారు ట్రాక్టర్
Post A Comment: