భద్రాచలం ఏప్రిల్ 21 జూనియర్ కాలేజీ సెంటర్ లోని శ్రీ సాయి బాబా మందిరంలో గురువారం ఉదయం బాబా వారికి పాలతో అభిషేకం జరిపారు. నూతన వస్త్రాలను అలంకరించి స్వర్ణ ఆభరణాలు ధరింపజేశారు.
హారతి పాడారు. అష్టోత్తర నామార్చన జరిపారు.
మధ్యాహ్నం కీర్తిశేషులు సమ్మిడి రవి వర్ధన్ రెడ్డి జ్ఞాపకార్థం వారి సతీమణి సునీత మరియు కుటుంబ సభ్యులు అన్నదానం జరిపారని అధ్యక్షులు తుమ్మలపల్లి సతీష్ తెలిపారు.
550 మంది భక్తులు బాబా వారి అన్నప్రసాదం స్వీకరించారు. అలాగే వృద్ధాశ్రమంలో వృద్ధులకు వంద మందికి భోజనం అందజేశారు. సాయంత్రం సంధ్య హారతి పల్లకి సేవ జరిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: