మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: రక్తహీనతను అధిగమించేలా పౌష్టికాహారాన్ని అవసరం అయిన మందులను తీసుకోవాలని ఎర్రగుంట ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ ప్రియాంక అన్నారు. శుక్రవారం ఆసుపత్రి పరిధిలోని మద్దుకూరు గ్రామ శివారు గోత్తికోయల గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు.గ్రామంలో గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, రక్తహీనత ఉన్నవారిని గుర్తించి ఐరన్ ఇంజక్షన్, గ్లూకోజ్ లో కలిపి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..... గర్భిణీలు, బాలింతలు తాజా కూరగాయలు, పండ్లను ఆహారంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఈఓ కృష్ణయ్య, హెల్త్ సూపర్వైజర్ నాగేశ్వరరావు, పి హెచ్ ఎన్ పుల్లమ్మ, స్టాఫ్ నర్స్ నాగమణి, ఏఎన్ఎం సుశీల, జయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: