మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ: అడవుల్ని ధ్వంసం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ రేంజర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు.మంగళవారం మద్దుకూరు, బెండాలపాడు గ్రామ శివారు లోని అటవీ ప్రాంతాన్ని,పోడు పేరుతో చెట్లను కాల్చిన చెట్లను ఆయన పరిశీలించారు. పోడు భూముల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను మొదలు భాగంలో బెరడుతీస్తూ చెట్లు ఎండెలా చేసి, కాల్చుతున్న విధానాన్ని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడవుల సంరక్షణ అందరి బాధ్యత, అటువంటి వృక్షాలను కాల్చటం సరైన చర్యకాదన్నారు. అడవుల సంరక్షణ కు ప్రజాప్రతినిధులు, నాయకులు గ్రామ పెద్దలు సహకరించాలన్నారు. పోడుదారులకు సహకరించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట అటవీశాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Post A Comment: