మన్యం టివి దుమ్ముగూడెం::
గౌరారం గ్రామపంచాయతీ పరిధిలోని తాటి వారి గూడెం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎంపీపీ రేసు లక్ష్మి మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ నిధుల నుంచి 5 లక్షల వ్యయంతో తాటి వారి గూడెం గ్రామంలో ప్రాథమిక పాఠశాల నుండి తుర్రం వీరయ్య ఇంటి వరకు నిర్మాణానికి శ్రీకారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ మారుమూల ఏజెన్సీ గ్రామాల్లో రోడ్డు మార్గం ద్వారా అభివృద్ధి సాధ్యపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సోడి జ్యోతి, ఉప సర్పంచ్ శ్యామల ఆదిలక్ష్మి, మాజీ సర్పంచ్ టిఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాముడు ,మహిళా సంఘం అధ్యక్షురాలు కనితి రాజమ్మ,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: