మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామపంచాయతీ పరిధిలోని గాండ్ల బయ్యారం గ్రామానికి చెందిన జక్కం ఝాన్సీ అనారోగ్యంతో బాధపడుతుండటంతో వారిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొని రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10,000 వేల రూపాయల చెక్కును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు శుక్రవారం నాడు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఎంపిపి గుమ్మడి గాంధీ, మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: