CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

రాష్ట్రంలో రానున్న ప్రభుత్వం భాజపానే- -:రాష్ట్ర కార్యదర్శి కుంజా సత్యవతి.

Share it:

 




 మన్యం టివి దుమ్ముగూడెం:: దుమ్ముగూడెం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ భద్రాచలం నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంజరిగింది

ఈ కార్యక్రమంలో కుంజా సత్యవతి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటీవల ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది అంటే మోడీ పారదర్శక పాలనే దానికి నిదర్శనం అని, ఈ ఉత్సాహంతో ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేసి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అదేవిధంగా స్థానిక ప్రజా సమస్యలపై దృష్టి సారించి పార్టీని అభివృద్ధి చేయాలని కోరారు. 

అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మాట్లాడుతూ నియోజకవర్గంలోని మండల అధ్యక్షులు బూతు స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన బూత్ కమిటీలను పూర్తిచేసి ఎన్నికలకు సిద్ధం కావాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను మండల స్థాయిలో ఎప్పటికప్పుడు ఎండగడుతూ అన్ని వేళలా ప్రజల్లో ఉండి పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, క్రమశిక్షణతో అంకితభావంతో పని చేస్తే కార్యకర్తలకు పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఎడ్లపల్లి శ్రీనివాస్ కుమార్, భూక్య సీతారాం నాయక్, ఉపాధ్యక్షులు బిట్రగుంట క్రాంతికుమార్, జిల్లా కార్యదర్శులు కనితి లక్ష్మి ,నిడదవోలు నాగబాబు, నియోజకవర్గ సీనియర్ నాయకులు కుంజా ధర్మా, కండ్రపు సింగరాయ రెడ్డి, భద్రాచలం మండల అధ్యక్షులు రామ్మోహన్ రావు, దుమ్ముగూడెం మండల అధ్యక్షులు తెల్లం శేఖర్ ,చర్ల మండల సీనియర్ నాయకులు లంక వెంకట్,ఆలెం సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు ..

Share it:

TS

Post A Comment: