గుండాల ఏప్రిల్ 13(మన్యం మనుగడ) మండలంలో గుట్కా వ్యాపారం మాటున మరో భయంకరమైన చీకటి దందా సాగుతుంది ఇప్పటి వరకు మండలంలో లేనటువంటి గంజాయి మూలాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. మండలంలో పెద్ద మొత్తం ఉండదు అక్రమ గుట్కా వ్యాపారం సాగుతుంది అని తెలుసు కానీ దాని మాటున గంజాయి విక్రయాలు కూడా సాగుతున్నాయని వార్తలు గుప్పుమన్నాయి. మండలంలో ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు ఎక్కువగా ఉన్నందున యువత పెద్ద మొత్తంలో మండల కేంద్రంలో ఉంటున్నారు. వీరిని ఆసరాగా చేసుకుని కొందరు గుట్కా వ్యాపారులు గుట్కా గంజాయి విక్రయాలను చేస్తున్నారు. పక్కనే ఉన్న వరంగల్ జిల్లా నుండి గుట్కా లతోపాటు గంజాయిని తరలించి చిన్న ప్యాకెట్ మార్చి గుట్కా మాదిరిగా విద్యార్థులకు అమ్ముతున్నారు. గుట్కా ప్యాకెట్ల మధ్యలో ఉంచడం వలన తరలించే వారిపై పెద్దగా లేకపోవడం వలన వారి వ్యాపారం సులువుగా సాగుతుంది. ఆదిలోనే అడ్డుకట్ట వేయకపోతే మండలంలోని యువత గంజాయి మత్తులో ఊగుతూ జీవితాన్ని నాశనం చేసుకునే పెను ప్రమాదం కొంచెం ఉంది ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఎంజాయ్, గుట్కా లకు అడ్డుకట్ట వేయాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.
Post A Comment: