మన్యం టీవీ చర్ల:
చర్ల మండలంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఈర్ని కృష్ణ మోహన్ రావు ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని గాంధీ బొమ్మ సెంటర్ ఏరియా లో నూతనంగా ఏర్పాటుచేసిన కరెంటు ఛార్జింగ్ తో నడిచే టూవీలర్ వాహన షోరూం ను చర్ల సి.ఐ.బి. అశోక్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం చర్ల ఎస్ఐ రాజు వర్మతో కలిసి షోరూంను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఇంధన ధరల మూలంగా సామాన్యుడు ద్విచక్ర వాహనం నడపలేని పరిస్థితుల్లో ఉన్నారని, పెట్రోల్ ఖర్చు లేకుండా నాలుగు గంటల కరెంటు ఛార్జి తో సుమారు వంద కిలోమీటర్లు నడవగల ద్విచక్ర వాహనాలను డయోడ్ మోటార్స్ వారు తయారు చేయడం పట్ల అభినందనలు తెలిపారు. చర్ల పట్టణానికి చెందిన ఈర్ని కృష్ణ మోహన్ రావు ఏజెన్సీ ప్రాంతంలో షోరూం ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జున రావు, పట్టణ ప్రముఖులు శేశెట్టి సాంబయ్య, ఎర్రంకి ఉదయ ప్రభాకర్, తడికల లాలయ్య, ఎస్.డి.అజీజ్,చింతా సత్యనారాయణ,దొడ్డి తాతారావు, పాత్రికేయులు ప్రభుదాస్, రవీంద్ర బాబు, వర్మ, రమణమూర్తి, రుషి, ప్రవీణ్ పాల్గొన్నారు.
Post A Comment: