మన్యం మనుగడ, పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం వెంకటరావుపేట పంచాయతీకి చెందిన పెద్ద బోయిన ముత్తమ్మ అనే మహిళ చెరువులో పడి మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చెరువులో నీళ్ల కోసం వెళ్లిన ముత్తమ్మ కాలుజారి పడిపోవడంతో లోతు లోనికి వెళ్లిపోయి మరణించింది. కుటుంబీకులు ఆమె జాడ కోసం వెతుకుతూ ఉండగా విగతజీవిగా స్థానిక మాల కుంట చెరువు లో కనిపించింది. మృతురాలికి భర్త నరసింహారావు, కొడుకు సాంబశివరావు, కూతురు రమాదేవి ఉన్నారు. ఈ విషయమై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Post A Comment: