ములకలపల్లి:మన్యం మనుగడ ప్రతినిధి:
పెంచిన డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను తగ్గించాని సిపియం మండలకార్యదర్శి ముదిగొండ రాంబాబు డిమాండ్ చేశారు.మండలంలో వివిధ గ్రామాలలో జరిగిన నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రోజు, రోజుకి చమురు, నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశాన్నంటేలా పెంచుతూ,సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మనదేశంలో చమురు ధరలు లేవని,చమురు కంపెనీల లాభాల కోసం రోజు,రోజుకీ రేట్లు పెంచుతూ పోతున్నారని,నిత్యావసర వస్తువుల ధరలు కూడా సామాన్యుడు కొనే స్థితిలో లేవని,వెంటనే ప్రభుత్వం దిగివచ్చి పెంచిన చమురు నిత్యావసర వస్తువుల ధరలనుతగ్గించాలని డిమాండ్ చేశారు.ఈకార్యక్రమంలో నాయకులు నిమ్మల మదు,
తిరపతమ్మ, హేమాని, వెంకటేశ్వర్లు, వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: