- ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద ముస్లింలకు రంజాన్ కానుకలు పంపిణీ
మన్యం మనుగడ కరకగూడెం: సమాజంలో పేదలను ఆదుకొని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా నిలువాలని కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా పిలుపునిచ్చారు.ఈ మేరకు ఆమె శనివారం మండల కేంద్రంలో ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ సభ్యులు కరకగూడెం గ్రామీణ వైద్యుడు షేక్ సోందు పాషా సమక్షంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 70 నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజన్ పండుగను పురస్కరించుకుని దుస్తులు,బియ్యం,సేమియాలు నిత్యావసరాలు ఉచితంగా అందజేశారు.ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రాణిక్ హిలింగ్ ఫౌండేషన్ వారు రంజాన్ కానుకలు పేదలకు అందజేయడం చాలా సంతోషకరమని అన్నారు.అంతేకాకుండా ఏజెన్సీ ప్రాంతంలో అన్ని వర్గాల ప్రజలకు ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమని మెచ్చుకొన్నారు.అనంతరం ఫౌండేషన్ సభ్యులు సోందుపాషా మాట్లాడుతూ రంజాన్ పండగను ప్రతీ కుటుంబం ఆనందంగా జరుపుకోవాలని ఈ కానుకలను పేదలకు అందజేసామని తెలిపారు. అలాగే ప్రజల అవసరాలను గుర్తించి భవిష్యత్తులో మరిన్ని సేవ కార్యక్రమాలు చేయడమే తమ ఫౌండేషన్ లక్షమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: