CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

ప్లాస్టిక్ నిషేధానికి సహకరించండి... రాష్ట్ర గవర్నర్ కి వినతి పత్రం అందించిన జెడి ఫౌండేషన్.. ఫౌండేషన్ సేవలకి కితాబిచ్చిన గవర్నర్.

Share it:

 


మన్యం మనుగడ వెబ్ డెస్క్:

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి పట్టాభిషేక మహోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీమతి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ని జేడీ ఫౌండేషన్ బృందం కలిశారు, మానవాళి మనుగడకు ప్రశ్నార్ధకంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి మరియు రాష్ట్రంలోని అన్ని ప్రధాన దేవాలయాల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించాలని ,అలాగే ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులపై జీఎస్టీ పరిధి స్లాబ్ ని తగ్గించాలి అని కోరుతూ వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జె.డి ఫౌండేషన్ కన్వీనర్ మురళి మోహన్ కుమార్ భద్రాచలం పట్టణంలో గత 4 సంవత్సరాలుగా చాంబర్ ఆఫ్ కామర్స్ వారి సహకారంతో చేపట్టిన ప్లాస్టిక్ నిషేధం పై ప్రగతిని వివరిస్తూ ప్రాజెక్టు రిపోర్ట్ అందజేసారు, అలాగే జేడీ పౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఉపాధి భరోసా ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా అందజేశారు. ఈ సందర్భంగా గవర్నర్ జేడి ఫౌండేషన్ సేవలను ప్రశంసించారు, తదనంతరం శ్రీమతి డా. తమిళసై ని జేడీ ఫౌండేషన్ బృందం జ్యూట్ బ్యాగ్, సీతారామ చంద్ర స్వామి చిత్ర పటము, శాలువా తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కార్యదర్శి శ్రీ ఖంభంపాటి సురేష్ కుమార్ ఆయుర్వేద పూల మొక్క ను గవర్నర్ గారికి బహుమతిగా అందించారు. ఈ కార్యక్రమంలో జేడీ ఫౌండేషన్ సభ్యులు శ్రీమతి హన్సి, శ్రీ కడా లి నాగరాజు శ్రీ యూసఫ్మియా పాల్గొన్నారు.

Share it:

TS

Post A Comment: