CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

TS

అశ్వారావుపేట లో ఇష్టారాజ్యంగా ఇటుక బట్టిలు ఏర్పాటు.

Share it:

 


మన్యం మనుగడ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేటలో ఇంటి నిర్మాణానికి ప్రధానంగా ఉపయోగించేవి ఇటుకలు. వీటిని కొందరు అక్రమ వ్యాపారంగా మలుచుకొని దందా నిర్వహిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన చట్టాలకు విరుద్ధంగా కనీసం ఎటువంటి అనుమతుల లేకుండా ఇష్టానుసారంగా బట్టిలు ఏర్పాటు చేస్తూ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్తును తమ వ్యాపారానికి అనుగునంగా వాడుకుంటున్నారు. మట్టి కోసం చెరువుల్లో తవ్వకాలు చేపడుతున్నారు. మండలంలో ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా బట్టిలు ఏజెన్సీ ప్రాంతాల్లో పట్టా భూములలో నిర్వహిస్తున్న చోద్యం చూస్తున్నా సంబంధిత శాఖ అధికారులు. బట్టీలను ఏర్పాటు చేయాలంటే పట్టా భూముల్లో కాకుండా, నాల అనుమతి (కమర్షియల్) రిజిస్ట్రేషన్ భూములలో మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అవేమి పట్టనట్టు అశ్వారావుపేట మండల ప్రాంతాల్లో ఇటుక వ్యాపారులు రైతులకు ఎంతో కొంత ఇచ్చి వారి పట్టాభూముల్లో ఏర్పాటు చేస్తున్నారు. పంటలు సాగు చేసుకునే రైతులను మభ్యపెట్టి వారి పంటపొలాల నుంచి మట్టిని తీసుకుంటూ ఇటుకలు తయారు చేస్తున్నారు. రాత్రి సమయాల్లో పరిసర ప్రాంతాల్లోని చెరువుల్లో అక్రమంగా మట్టిని తవ్వుతూ ఇటుకల తయారీకి ఉపయోగిస్తుండటం విశేషం ఇటుక బట్టీ ఏర్పాటు చేయాలంటే పరిశ్రమలశాఖ, మైనింగ్‌, రెవెన్యూ, కార్మికశాఖ, రవాణశాఖ, విద్యుత్తుశాఖ, ఇరిగేషన్ తదితర శాఖల నుంచి అనుమతులు తీసుకొని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వీటిల్లో ఏ ఒక్క అనుమతి లేకున్నా సదరు నిర్వాహకులపై చర్యలు తీసుకోవటంతో పాటు, బట్టీలను సీజ్‌ చేసే అధికారం మండల రెవెన్యూ అధికారులు ఉన్నా ఇప్పటివరకు ఒక్క బట్టీపై చర్యలు తీసుకోలేదు. గ్రామస్థాయిలో ప్రత్యక్షంగా బహిరంగంగా వ్యాపారం కొనసాగుతున్నా అధికారులు ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలున్నాయి. ప్రభుత్వం వ్యవసాయం కోసం 24గంటల పాటు ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తుంటే ఇటుక బట్టీల వ్యాపారం నిర్వహించే వారు మాత్రం ఉచిత విద్యుత్తును తమ వ్యాపారానికి వాడుకుంటున్నారు. ఇటుక బట్టీ నిర్వహణకు నీరు అధికంగా అసవరం ఉంటుంది. పట్టా భూముల్లో ఉండే వ్యవసాయ మోటారు బోరు నుంచి పైపులు వేసుకొని ఉచిత విద్యుత్తును వాడుకుంటున్నారు. మండలంలో ఇటుకబట్టీల వద్ద ఉచిత విద్యుత్తు చౌర్యం జరుగుతున్నా విద్యుత్తుశాఖ అధికారులు అటువైపు కూడా చూడరని, రైతులు ఆరోపిస్తున్నారు. బిల్లులు చెల్లించని రైతుల మోటార్ల కనెక్షన్లు తొలగించే అధికారులు, విద్యుత్తు చౌర్యం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంలో సంబంధిత శాఖల పూర్తి విఫలం అవుతున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Share it:

TS

Post A Comment: