గుండాల/ ఆళ్ల పల్లి ఏప్రిల్ 13(మన్యం మనుగడ) సీఎం సహాయనిధి నిరుపేదల పాలిట కవచంలా నిలుస్తుందని జడ్పిటిసి హనుమంతరావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాయం నరసింహారావు అన్నారు. మంగళవారం రాత్రి మర్కోడు గ్రామానికి చెందిన రణం శేఖర్ కు మంజూరైన 60 వేల రూపాయల చెక్కును ఆయనకు అందజేశారు. పినపాకఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మండలంలో ఇప్పటివరకు సీఎం సహాయనిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయించారు అన్నారు. ఆపదలో ఉన్న వారికి సిఎం సహాయ నిధి ఎంతో తోడ్పాటు గా నిలుస్తుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు శంకర్ బాబు, నరసింహారావు, మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రాంబాబు, సోషల్ మీడియా అధ్యక్షులు కంచర్ల సందీప్, నాయకులు రవి, రాంబాబు, రాము, రమేష్ , భాస్కర్, ఇందు కుమార్, సాయిరాం తదితరులు పాల్గొన్నారు
Post A Comment: