మన్యం మనుగడ, అశ్వారావుపేట: అశ్వారావుపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 62 కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు బుధవారం పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మెచ్చా మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ దేవుడని, ప్రతి పేద కుటుంబానికి కొండంత అండగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: