మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మణుగూరు మున్సిపాలిటీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, పెండింగ్ పనులన్నింటినీ వేగవంతం పూర్తిచేయాలని అన్నారు.ప్రజల అవసరాలకు ఉపయోగపడే అభివృద్ధి పనులకు సంబంధించి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని,అధికారులను ఆదేశించారు.మణుగూరు పట్టణ అభివృద్దే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మున్సిపల్ కమిషనర్ కె. మాధవి,మున్సిపల్ ఏ ఈ సత్యనారాయణ,వర్క్ ఇన్స్పెక్టర్ అనిల్, కోటేశ్వరరావు,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: