మన్యం మనుగడ ప్రతినిధి చండ్రుగొండ :మండల పరిధిలోని తిప్పనపల్లి గ్రామంలోని మస్జిద్ అల్ ఖదీర్ మస్జిద్ లో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ముస్లిం సోదరులకు అందజేస్తున్న రంజాన్ తోఫా గిఫ్ట్, బ్యాగులను జిల్లా పరిషత్ కోఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం అన్ని మతాల నిరుపేదలకు పండుగలకు కానుకలు ఇవ్వడం జరుగుతుందని, నిరుపేదల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం తోడ్పడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ లంక విజయలక్ష్మి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, ఉపసర్పంచ్ దారావత్ రామారావు, మండల రైతు కో ఆర్డినేటర్ గాదె లింగయ్య, ఉపాధ్యక్షులు భూపతి శ్రీనివాసరావు, టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండా, డిప్యూటీ తహశీల్దార్ ఎల్ ప్రసన్న, మూడు మస్జీద్ కమిటీల అధ్యక్షులు సయ్యద్ ఇసూబ్ మియా, సయ్యద్ రఫీ, యస్ కే వలిఅహ్మద్, సభ్యులు యస్ కే ఇస్మాయిల్, సయ్యద్ సైదా, దావూద్ మియా, యస్ కే నజీర్, సయ్యద్ మహిముద్, ఫేక్ రఫీ, షేక్ అజీజ్, సయ్యద్ అబ్దుల్ అజీజ్, అబ్దుల్ హలీం, షేక్ సలీం, ముస్లిం మహిళలు పాల్గొన్నారు.
Post A Comment: