మన్యం మనుగడ, భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం బస్టాండ్ లో భద్రాద్రి భక్తులకు ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి కీర్తిశేషులు ఇమంది నాగేశ్వరరావు జ్ఞాపకార్థం మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమ శిబిరాన్ని కొత్తగూడెం ఆర్టీసీ డిపో మేనేజర్ జవ్వాది వెంకటేశ్వరబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ భద్రాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ ప్రయాణికులకు మరియు బస్ డిపో కండక్టర్ డ్రైవర్లకు వేసవి తాపాన్ని తీర్చేందుకు ఏర్పాటుచేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహకుల ను అభినందించారు. ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగి ఇమంది నాగేశ్వరరావు కొత్తగూడెం డిపోలో ఎంతో నిబద్ధతతో చివరి శ్వాస వరకు పనిచేశారని అన్నారు. కొత్తగూడెం బస్ డిపోలో ప్రతి ఒక్కరు ఇమంది నాగేశ్వరరావు సేవలను ఎన్నటికీ మరచిపోరని కొత్తగూడెం ఆయన ఆర్టీసీ డిపో ముద్దుబిడ్డ అని అన్నారు. ఆయన జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన ఇటువంటి మంచి కార్యక్రమాలను ఆయన కుమారుడు ఇమంది ఉదయ్ కుమార్ ఎల్లప్పుడు కొనసాగించాలని ఆకాంక్షించారు..
ఈ కార్యక్రమంలో ఉషోదయ చారిటబుల్ ట్రస్టు నిర్వాహకులు ఇమంది ఉదయ్కుమార్, కృష్ణవేణి గణేష్, సోదరుడు హరికృష్ణ సుధాకర్, దశరథ రజువ, మురళి, మందా హనుమంతు, కోదాడ శ్రీనివాస్, రామకృష్ణ, మల్లేష్, కమల్ ,ఆర్టీసీ వై ఎన్ రావు, మందా వెంకటేశ్వర్లు ఆర్టీసీ డ్రైవర్లు మరియు కండక్టర్లు పాల్గొన్నారు.
Post A Comment: